ఆపదలో ఆదుకుంటున్న ‘ఆరాధన’

హైదరాబాద్‌: కరోనా విజృంభిస్తున్న ఈ తరుణంలో ప్రార్థన మందిరాలన్ని( గుడి, చర్చి, మసీద్‌) మూసివేశారు. అందుకే ప్రతి ఒక్కరు తమ తోటి వారిలోనే భగవంతుడిని చూసుకుంటూ మానవసేవే మాధవ సేవ అంటూ తమ తోచిన సాయాన్ని చేస్తూ పక్కవారికి చేయూతనిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే  రన్ ఫర్ జీసస్ అవుట్ రీచ్ సందర్భంగా  ఆరాధన టెలివిజన్ సౌజన్యంతో హైదరాబాద్‌ అన్నోజిగూడ , పెరాజీము క్రిస్టియన్ ప్రేయర్ హాల్ ఆధ్వర్యములో నిరుపేద కుటుంబాలకు ఆహారం పాకెట్లు, నిత్యావసర సరకులు పంపిణీ చేశారు.